తెలుగు ,తమిళ భాషల “విరాట్టు “మూవీ తో మోడల్ ప్రగ్య జైస్వాల్ టాలీవుడ్ , కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు. ఎన్ని మూవీస్ లో నటించినా ప్రగ్య స్టార్ డమ్ అందుకోలేకపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రగ్య జైస్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “అఖండ ” మూవీ లో దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ లతో వర్క్ అద్భుతం అనీ , ఈ సినిమాలో తన పాత్ర కేవలం గ్లామర్కే పరిమితం కాదనీ , కథపరంగా అభినయానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందనీ , దర్శకుడు బోయపాటి శ్రీను తన పాత్ర రూపాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసారనీ , సినిమాలో తన లుక్ చాలా భిన్నంగా ఉంటుందనీ , దర్శకుడు బోయపాటి ఈ సినిమాలో నేను విభిన్నంగా లేదా ప్రత్యేకంగా కనిపించాలని తన పాత్రపై ఎంతో కసరత్తు చేశారనీ , తన పాత్రకు పూర్తి తాజాదనాన్ని ఇవ్వాలనుకోవడం ఒక సవాల్ గా నిలిచిందనీ , “అఖండ “మూవీ ఉత్కంఠ పెంచే కథతో తెరకెక్కిందనీ , అందుకే ఎంతో ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాననీ ప్రగ్య చెప్పారు. ప్రగ్య కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: