‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న మూడో సినిమా అఖండ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడ్డారు మేకర్స్. ఇప్పటివరకూ టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకోగా ప్రస్తుతం గోవాలో పాటల చిత్రీకరణలో ఉన్నారు. ఇక ఈషెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవనున్నట్టు తెలుస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా అఖండ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసారి తన కొత్త సినిమాలో మూడు గెటప్పుల్లో కనిపించనున్నాడట. అఖండ సినిమా తరువాత బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో సినిమా చేయనునన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వినిపించగా ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఆయన బాలకృష్ణను మూడు విభిన్నమైన గెటప్పులలో చూపించనున్నాడట. ప్రస్తుతం ఈవార్త అయితే జోరుగా వినిపిస్తుంది.
కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానాను గానీ .. త్రిషను గాని తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని కథను పూర్తి చేసే పనిలో ఉండగా త్వరలోనే ఈసినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: