మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సుబ్బరాజు , వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సర్కారు వారి పాట ” మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ ను దుబాయ్ లో కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.దుబాయ్ షెడ్యూల్ తరువాత కరోనా కారణంగా భారీ గ్యాప్ వచ్చింది. 2 వారాల పాటు గోవా షెడ్యూల్ జరిగిన విషయం తెలిసిందే. గోవాలో రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ఆధ్వర్యంలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లు కంపోజ్ చేశారనీ , అవి సినిమాకు హైలెట్ అవుతాయనీ సమాచారం.హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న”సర్కారు వారి పాట”నెక్స్ట్ షెడ్యూల్ను మేకర్స్ స్పెయిన్ దేశంలో ప్లాన్ చేశారు. సెప్టెంబర్ నెలాఖరుకి స్పెయిన్ వెళ్లనున్న చిత్ర బృందం, దాదాపు నెలరోజులు అక్కడే చిత్రీకరణ జరపనున్నారనీ , ఈ షెడ్యూల్ లో టాకీతో పాటు ఒకటి రెండు సాంగ్స్ చిత్రీకరణ జరపనున్నారనీ సమాచారం. చివరి షెడ్యూల్ డిసెంబర్ కల్లా ముగించి, జనవరి లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: