ఇక ఎప్పుడూ లేనంతగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కష్టపడుతున్నాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈరెండు సినిమాలు సెట్స్ పైనే ఉన్నాయి. అయితే కరోనా వల్ల కొద్ది రోజులు షూటింగ్ కు బ్రేక్ రాగా తిరిగి ఇటీవలే షూటింగ్ లను మొదలుపెట్టాయి. ఇన్ని రోజులు సలార్ షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ తాజాగా ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్లైమాక్స్ షూట్ చాలా రోజులపాటే జరగనుందట. సినిమాకు ఇదే హైలెట్ కాబట్టి హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలను తెరకెకెక్కించనున్నారట.
ఈ మైథాలజీ ఫిల్మ్లో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: