యంగ్ హీరో సందీప్ కిషన్ మాత్రం సూపర్ స్పీడుమీదున్నాడు. సినిమా హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఒక్క సినిమా రిలీజ్ చేయడానికే హీరోలు ఇబ్బందులు పడుతుంటే సందీప్ కిషన్ మాత్రం ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేసి వావ్ అనిపించుకున్నాడు. ఏ1 ఎక్స్ ప్రెస్ ఈఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కాగా.. తాజాగా గల్లీ రౌడీ సినిమా కూడా రిలీజ్ అయింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ అయిందో లేదో అప్పుడే మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీఅయిపోయాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సినిమా వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్దమయ్యాడు. రేపు ఈసినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. వెంటనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలుపెట్టి ఈసినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ చూస్తున్నట్టు తెలుస్తుంది.
కాగాహాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈసినిమాకు బాలాజీ గుట్ట సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారట. మరి వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘టైగర్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల తరువాత మళ్లీ కలిసి చేస్తున్నారు. సూపర్ న్యాచురల్ ఫాంటసీ జోనర్లో కొత్త కాన్సెప్ట్ తో ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: