“లై “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.”ఛల్ మోహన్ రంగ “మూవీ లో కథానాయికగా నటించిన మేఘ రజనీకాంత్ “పేట ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “శాటిలైట్ శంకర్ ” మూవీ తో మేఘ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. రీసెంట్ గా “రాజ రాజ చోర “, “డియర్ మేఘ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మేఘ ప్రస్తుతం తెలుగులో“గుర్తుందా శీతాకాలం”, “మనుచరిత్ర” తెలుగు మూవీస్, తమిళ భాషలో రెండు మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోస్ శింబు, ధనుష్ ఇంకా పలువురు యంగ్ స్టార్స్ తో సినిమాలు చేసిమేఘ కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయారు. సోషల్ మీడియాలో మేఘ ఆకాష్ చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా మేఘ ఆకాష్ ఇన్ స్టా గ్రామ్ లో 3 మిలియన్ ఫాలోవర్స్ మైలు రాయి ని చేరుకున్నారు. ఆ సందర్భం గా మేఘ ఆకాష్ ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ బీచ్ లో లవ్ సింబల్ వేసి అందులో పూలతో అలంకరించి మూడు మిలియన్ లు అని రాసి తన ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. మూడు మిలియన్ ల మంది ఫాలోవర్స్ దక్కినందుకు ఆమె సంతోషంతో సన్నిహితులకు పార్టీ ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: