బుల్లితెర పై సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తూ బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఒక ఆంథాలజీ మూవీకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “గాడ్ ఫాదర్ “మూవీ లో అనసూయ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. ఇప్పుడు అనసూయ ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ లో హీరోయిన్ గా ఆఫర్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు సంపత్ నంది తన దగ్గర పని చేసిన ఒక అసిస్టెంట్ దర్శకత్వంలోఅనసూయ హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీ ని నిర్మించడానికి ప్లాన్ చేశారు. ఈ మూవీ లో అనసూయ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన “సీటీమార్ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: