యాక్షన్ హీరో గోపీచంద్ ఎంతో కాలం నుండి మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే చాలా కాలం తరువాత సీటీమార్ తో మంచి విజయం దక్కించుకున్నాడు. ఇక ఇదే జోష్ తో ఎన్నో యేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆరడుగుల బుల్లెట్ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆరడుగుల బుల్లెట్ “. ఇప్పటికే రెండు మూడుసార్లు ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. ముందు జూన్ అనుకున్నారు.. ఆ తరువాత ఆగష్ట్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ అదీ కుదరలేదు. ఇక ఫైనల్
గా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ రిలీజ్ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే డేట్ మాత్రం ఎప్పుడో ప్రకటించలేదు చిత్రయూనిట్. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా జై బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో ప్రకాష్ రాజ్ ,అభిమన్యు సింగ్ , కోట , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. మరి ఏడెనిమిది ఏళ్ల క్రితం రాసిన కథతో ఈ సినిమా వస్తుంది.. మరి ఇప్పుడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. ఈసినిమా ఎంతమేరకు మెప్పిస్తుందో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: