ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఇక రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఈసినిమా షూట్ కు ఆ మధ్య బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. ఇక ఈసారి మాత్రం గ్యాప్ లేకుండా షూట్ ను కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అదే దిశగా షూటింగ్ జరుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తుంది. ఈసినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. షూట్ లో భాగంగా ప్రభాస్ 60 రోజుల పాటు రాముడు గెటప్ లోనే ఉంటాడట. మరి రాముడి పాత్రలో చేస్తున్నాడు కాబట్టి దాదాపు అదే గెటప్ లో ఉండాల్సి ఉంటుంది.
కాగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో కృతి సనన్ సీతగా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. ఈసినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.
కాగా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా షూటింగ్ దశలో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: