బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్” చిత్రంతో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “భీమ్లా నాయక్”మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు . ఈ మూవీ తో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న”హరిహర వీరమల్లు” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ తమ మూవీస్
అప్ డేట్స్ రిలీజ్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న “#PSPK 28 ” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని , వై రవిశంకర్ దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. నిర్మాతలు మాట్లాడుతూ .. “భీమ్లా నాయక్”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉందనీ , తరువాత “హరిహర వీరమల్లు ”
షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుందనీ , తరువాత “#PSPK 28 ” మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందనీ తెలిపారు. దర్శకుడు హరీష్ శంకర్ , హీరో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందిన “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: