జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. ముందు కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేసుకుంటే రీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద ఉన్న పోటీకి మరోసారి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అన్నీ బావుంటే నిన్న ఈసినిమా రిలీజ్ అవ్వాల్సింది కానీ అప్పటికే చాలా సినిమాలు ఉండటంతో మేకర్స్ కాస్త వెనక్కి తగ్గారు. ఈవిషయాన్ని అధికారికంగా కూడా చెప్పారు. అయితే రిలీజ్ వాయిదా వేస్తూనే సెప్టెంబర్ లోనే రిలీజ్ డేట్ ఉంటుందని ముందే తెలిపారు. ఈనేపథ్యంలోనే నేడు ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 17న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వైవా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందిస్తుండగా… చౌరస్తా రామ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: