టాలీవుడ్ యంగ్ హీరో విభిన్నమైన కథలతో.. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్నాడు కార్తికేయ. ఇక ఈ ఏడాదే చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు రాజా విక్రమార్క సినిమాతో వచ్చేస్తున్నాడు. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడితో కార్తికేయ రాజా విక్రమార్క సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా రేపు ఉదయం 10గంటల 35 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
కాాగా యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆదిరెడ్డి. టి సమర్పణలో.. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: