ఎస్ దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరో గా రూపొందిన “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ తో మోడల్ , ఫెమినా మిస్ ఇండియా (2018) టైటిల్ హోల్డర్ మీనాక్షి చౌదరి టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకున్నారు. మీనాక్షి ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ “ఖిలాడి “, అడివి శేష్ “HIT 2 “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. తెలుగు నేర్చుకోవడానికి మీనాక్షి ఎంతగా శ్రమించిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భాషను నేర్చుకోవాలని బలంగా సంకల్పించాననీ, తన మొదటి సినిమా డైలాగులను ముందు రోజు రాత్రి హిందీలోకి మార్చుకుని తర్వాత స్థానిక భాషలోకి తెలిసిన వాళ్ల ద్వారా తర్జుమా చేసి చెప్పేదాన్ననీ , అలా తెలుగు కొంచెం అర్ధమైందనీ , రెండవ సినిమాకి ఆ ప్రాక్టీస్ ఎంతో పనికొచ్చిందనీ , ఇప్పుడు తెలుగు మాట్లాడటం..అర్ధం చేసుకోవడం చాలా సులభంగా ఉందనీ , కెరీర్ ఆరంభంలోనే మీనాక్షి చౌదరి ఇంత తొందరగా తెలుగు నేర్చుకోవడం అనేది విశేషమే. అందాల పోటీల నుంచి వచ్చిన రకుల్ ప్రీత్ ని ఈ బ్యూటీ రీప్లేస్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: