కృష్ణ అండ్ హిజ్ లీల అనే సినిమాతో ఫామ్ లోకి వచ్చిన సిద్దూ జొన్నలగడ్డ ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సడెన్ గా ఈసినిమా టైటిల్ ను మార్చారు చిత్రయూనిట్. నరుడి బ్రతుకు నటన అంత క్యాచీగా లేదని ఈసినిమాకు డీజే టిల్లుగా మార్చి దీనిని అధికారికంగా ప్రకటించారు కూడా. డీజే టిల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేసి అట్లుంటది మనతోని అనే ట్యాగ్ ను కూడా యాడ్ చేశారు. దీంతో ఈసినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడతాడనే విషయం అర్థమైపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఈఏడాది ఫిబ్రవరి లో షూటింగ్ ను ప్రారంభించగా.. అతరువాత వెంటనే సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ చేసి దాదాపు పూర్తి చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్.
కాగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో ప్రిన్స్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తుండగా.. బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: