తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.సూపర్ హిట్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కతా నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ ను సాయి పల్లవి కంప్లీట్ చేశారు..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి రెండు సంవత్సరాలుగా కోలీవుడ్ కు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు సాయి పల్లవి తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ బ్యానర్ పై గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందనున్న తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “యాక్ట్ 1978 ” కన్నడ మూవీ ఫేమ్ దర్శకుడు మన్సోర్ (Mansore) ఇటీవలే పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న తన సినిమాలో కీ రోల్ కోసం సాయిపల్లవిని సంప్రదించారని సమాచారం. మన్సోర్ చెప్పిన కథ, కథనం నచ్చిన సాయిపల్లవి..స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయాలని డైరెక్టర్ మన్సోర్ కు సూచించినట్టు సమాచారం. తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి కన్నడ ప్రేక్షకులను కూడా అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: