కరోనా మహమ్మారి తో దేశం అల్లకల్లోలమైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ , కర్ఫ్యూ లతో జన జీవనం అస్త వ్యస్త మైంది. కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. ఆక్సిజన్ దొరకక , హాస్పిటల్స్ లో బెడ్స్ అందుబాటులో లేక లక్షలాది మరణాలు సంభవించాయి. వేలాది మంది ఉపాధిని కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేశంలోని దాదాపు అన్ని రంగాలు వెనకబడ్డాయి. ఎంతో మంది ఆకలితో అలమటించారు. ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. సెలెబ్రిటీలు సైతం తమ వంతుగా సాయం చేశారు. కరోనా చారిటబుల్ ట్రస్ట్ అంటూ చిరంజీవి గత సంవత్సరం సినిమా కార్మికులను ఆదుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనాకు వ్యతిరేకంగా పోరాడుదాం. త్వరలోనే మీ ముందుకు వస్తున్నాను అంటూ చిరంజీవి ఒక వీడియోను రిలీజ్ చేశారు. రిలీఫ్లో పాలు పంచుకోండనీ , ఈ మంచి పనిలో మీరూ కొంత సాయం చేయండనీ , ఇండియా కోవిడ్ రెస్పాన్స్ ఫండ్కు మద్దతు ఇవ్వండనీ చిరంజీవి ప్రజలకు పిలుపునిచ్చారు. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం “లూసిఫర్ “తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: