ఆది సాయికుమార్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీనిలో భాగంగానే ఆది, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ ఇప్పటికే కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. వీరభద్రం డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను విజన్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ పతాకాలపై నాగం తిరుపతి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాతలుగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఆది-పాయల్ కాంబినేషన్ లో రెండో సినిమా రాబోతుంది. కల్యాణ్జీ గోగణ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా గ్రాండ్ గా లాంఛ్ చేశారు. నేటి నుండి ఈసినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతానికి టీఎంకే అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
కాగా విజన్ సినిమాస్ పతాకంపై వ్యాపారవేత్త నాగం తిరుపతి నిర్మిస్తున్న ఈసినిమాలో సునీల్, పూర్ణ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. బాల్రెడ్డి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
మరోవైపు ఈసినిమాలతో పాటు ఆది కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వంలో ‘జంగిల్’ అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ బ్యానర్స్పై మహేష్ గోవిందరాజ్, అర్చనా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’. ఇంకా జిబి కృష్ణ దర్శకత్వంలో బ్లాక్ సినిమా చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: