కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సలార్. పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా .. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాాగా తన షూటింగ్ ను పూర్తి చేసుకుంది శృతి. ఇక ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.
ఇక రీఎంట్రీ తరువాత శృతీ హాసన్ వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో వకీల్సాబ్, క్రాక్ సినిమాలతో హిట్లు అందుకున్న ఈ అమ్మడు సలార్ తో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
కాగా హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్ కు విలన్గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: