ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ‘పాగల్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమా కాకుండా విశ్వక్ సేన్ ఓ మై కడవులే సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈసినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తుండగా, అశ్వథ్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో అతిథి పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈసినిమా మేకర్స్ ఇప్పటికే అల్లు అర్జున్ ను కలవగా బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో అశోక్ సెల్వన్ , రితికా సింగ్ జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “ఓ మై కడవులే “. తమిళంలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. హీరో విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో నటించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: