కరోనా వల్ల గత ఏడాది నుండి సినీ పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూస్తూనే ఉన్నాం. సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి… రిలీజ్ లు ఆగిపోయాయి. అయితే కొంత మంది డైరెక్టర్లకు మాత్రం ఈ కరోనా కొత్త కథలను రాయడానికి కలిసొచ్చింది. అంతేకాదు కరోనా నేపథ్యంలో కూడా ఇప్పటికే కొన్ని సినిమాలు తెరకెక్కిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా కరోనా నేపథ్యంలోనే వస్తున్నట్టు తెలుస్తుంది. మారుతి దర్శకత్వంలో మంచి రోజులు వచ్చాయి అన్న సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా కూడా కరోనా బ్యాక్ డ్రాప్ లో వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వచ్చిన తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది.. ఎవరెవరు ఎలా బిహేవ్ చేశారు అన్న కోణంలో కామెడీ ఎంటర్ టైనర్ గా మారుతి ఈసినిమాను తెరకెక్కించాడట. మరి వెరైటీ కామెడీతో ప్రేక్షకులను నవ్వించడంలో మారుతిది సెపరేట్ మార్క్.. దీంతో ఈసినిమా కూడా ఖచ్చితంగా మంచి కామెడీ ఎంటర్ టైనర్ అవుతుందంటున్నారు.
కాగా ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సాయిశ్రీరామ్ అందిస్తున్నాడు. విడుదల తేదీని అతి త్వరలో ప్రకటించనున్నారు చిత్రయూనిట్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: