సక్సెస్ ఫుల్ “ఊహలు గుసగుసలాడే” మూవీ తో రాశీఖన్నా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా తమిళ మూవీస్ లో బిజీగా మారారు.హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు “అరణ్మణై 3”, “తుగ్లక్ దర్బార్”, “సర్దార్”, “మేధావి”, “సైతాన్ కా బచ్చా”(తమిళ ) ‘భ్రమమ్’ మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.మూడు వెబ్ సిరీస్ లకు రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీస్ , వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న రాశీఖన్నా కోలీవుడ్ లో ఒక బంపరాఫర్ స్వంతం చేసుకున్నారు. అగ్ర హీరో ధనుష్ సరసన కథానాయికగా రాశీఖన్నా ఎంపిక అయ్యారు. సన్పిక్చర్స్ బ్యానర్ పై మిత్రన్ జవహర్ దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా ఒక మూవీ తెరకెక్కనుంది. హీరో ధనుష్ 44 వ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ లో దర్శకుడు భారతీరాజా , ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. హీరో ధనుష్తో జోడీగా భారీ సినిమాలో భాగం కావడం పట్ల రాశీఖన్నా సంతోషం వ్యక్తం చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: