సక్సెస్ ఫుల్ “ఊహలు గుసగుసలాడే” మూవీ తో రాశీఖన్నా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా తమిళ మూవీస్ లో బిజీగా మారారు.హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు “అరణ్మణై 3”, “తుగ్లక్ దర్బార్”, “సర్దార్”, “మేధావి”, “సైతాన్ కా బచ్చా”(తమిళ ) ‘భ్రమమ్’ మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.అందాల రాశీఖన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ది ఫ్యామిలీ మ్యాన్”వెబ్ సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే షాహిద్ కపూర్ హీరోగా రూపొందిస్తోన్న కొత్త వెబ్ సిరీస్ కి రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాశీఖన్నా ఇప్పుడు నూతన దర్శకుడు సురేష్ వంగ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో క్రైమ్ , యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఈ వెబ్ సిరీస్ లో రాశీఖన్నా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ – బీబీసీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ మపుస్కర్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ “రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్” లో రాశీఖన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. అజయ్ దేవగన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో రాశీఖన్నా సైకో కిల్లర్ పాత్రలో నటిస్తున్నారు. ఇలా పలు కమిట్ మెంట్స్ తో రాశీఖన్నా బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: