గత ఏడాది నుండి ఇప్పటివరకూ ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. చాలామంది కరోనాకారణంగా చనిపోతే మరికొంతమంది పలు అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ నటి మృతిచెందారు. గత కొద్దిరోజులుగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆమె నేడు బెంగుళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక 1960లో ‘యానై పాగన్’ అనే తమిళ సినిమాతో బాలనటిగా ఆమె మొదటిసారి వెండితెరకు పరిచయమయ్యారు. వై.ఆర్.స్వామి దర్శకత్వంలో తొలిసారి హీరోయిన్ గా నటించిన ఆమె కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటించింది. ఈనేపథ్యంలో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో సుమారు 500లకు పైగా చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులో ముఖ్యంగా ‘జగదేక వీరునికథ’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పెదరాయుడు’, ‘కులగౌరవం’, ‘జస్టిస్ చౌదరి’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అంతేకాదు ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులను సైతం దక్కించుకుంది. ఉత్తమ నటి అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. సినీ పరిశ్రమకు జయంతి చేస్తున్న సేవలను గుర్తించిన కన్నడ చిత్రసీమ ఆమెను ‘అభినయ శారద’ అనే బిరుదుతో సత్కరించింది. ఇక రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: