శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన “ఫిదా ” మూవీ 2017 సంవత్సరం జూలై 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి తెలంగాణ యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. శక్తికాంత్ కార్తీక్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఫిదా “మూవీ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో “ఫిదా “మూవీ ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. దర్శకుడుగా శేఖర్ కమ్ముల ఇది వరకు సినిమాలతో పోల్చుకుంటే “ఫిదా”మూవీ ప్రత్యేకం అనే చెప్పాలి. అతని స్టైల్ అఫ్ మేకింగ్ చూపిస్తూ, డైలాగ్స్, ఎమోషన్స్ ని చూపించడంలో తన మార్క్ మరల రిపీట్ చేశారు. “ఫిదా “మూవీ కి మేజర్ ప్లస్ సాయి పల్లవి. కుటుంబం, ప్రేమ అనే బంధాల మధ్య నలిగిపోయే ఓ మామూలు అమ్మాయి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. హీరో వరుణ్ తేజ్ తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: