యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసపెట్టి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు ఒక్క సినిమాలు చేస్తుంటే వీళ్లు మాత్రం ఒక్కోక్కరూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది.ఈసినిమాత తరువాత గోపిచంద్ మలినేని తో మరొక సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడు గోపిచంద్ మలినేని. అఖండ అయిపోయిన వెంటనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాల తరువాత వరుసగా పలు డైరెక్టర్లతో సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ తన ప్యూచర్ ప్రాజెక్స్ట్ గురించి చెప్పారు. బోయపాటి, గోపిచంద్ మలినేని సినిమాల తరువాత అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్ తోసినిమాలు ఉన్నాయని.. ఆ తరువాత ఆదిత్య 369 సీక్వెల్ లైన్ లో ఉందని తెలిపాడు. అంతేకాదు..మరో టాప్ బ్యానర్లో కూడా సినిమా ఉందని తెలిపాడు. హారిక అండ్ హాసిని బ్యానర్లో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు.
మరి ఇప్పుడు కూడా బాలకష్ణ ఇలా టాప్ డైరెక్టర్లు, టాప్ నిర్మాణ సంస్థలతో కలిసి గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం గొప్ప విషయమే. ముఖ్యంగా బాలయ్య ఇలా కంటిన్యూగా సినిమాలు చేస్తే ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: