ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఈసినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిదే కదా. అయితే ఇప్పుడు మేకర్స్ ఈవిషయంలో క్లారిటీ ఇచ్చారు. ఆది పినిశెట్టి ఈసినిమాలో నటిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Welcome Onboard @AadhiOfficial for #RAPO19
Ustaad @ramsayz @dirlingusamy @IamKrithiShetty @ThisIsDSP @SS_Screens @sujithvasudev @srinivasaaoffl @NavinNooli @anbariv pic.twitter.com/utX4zVQQgJ
— Srinivasaa Silver Screen (@SS_Screens) July 19, 2021
హీరోగా, విలన్ గా, బలమైన పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా మెప్పిస్తున్నాడు ఆది పినిశెట్టి. ఆదిపినిశెట్టి ఇప్పటికే `అజ్ఞాతవాసి`, `సరైనోడు` చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించారు. ఇప్పుడు ఈసినిమాతో మరోసారి నెగిటివ్ షేడ్ లో నటించడానికి రెడీ అయ్యాడు. చూద్దాం మరి ఈసినిమాలో రామ్-ఆది ఎలా మెప్పిస్తారో.
కాగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో నదియా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మాత శ్రీనివాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో తెలుగు, తమిళ భాషల్లో ప్రెస్టీజియస్గా తెరకెక్కించనున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా హైద్రాబాద్ లోనే షూటింగ్ ను జరుపుకుంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: