విభిన్న కథా చిత్ర దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ , స్వాతి జంటగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “కార్తికేయ “ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా “కార్తికేయ “మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 “తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో షూటింగ్ జరుపుకున్న “కార్తికేయ 2 ” మూవీ ఆగస్ట్ నుండి యూరప్, వియత్నాం వంటి దేశాల్లో చిత్రీకరణ కు దర్శకుడు ప్లాన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“కార్తికేయ 2 “వర్కింగ్ టైటిల్ గా రూపొందుతున్న ఈ మూవీ కి “దైవం మనుష్య రూపేణా ” టైటిల్ ను దర్శక , నిర్మాతలు ఫిక్స్ చేసినట్టు సమాచారం. “దైవం మనుష్య రూపేణా ” టైటిల్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందిన “18పేజెస్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నిఖిల్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: