పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది.హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్లో విజయ్ దేవరకొండ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక షూటింగ్ షెడ్యూల్ ముంబై లో జరుపుకున్న “లైగర్ “మూవీ కరోనా కారణం గా చాలా గ్యాప్ తరువాత ముంబై లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభమయ్యింది. ముంబై లో కోవిడ్ -19 ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో”లైగర్ “చిత్ర యూనిట్ షూటింగ్ నిలిపివేశారు. “లైగర్ “మూవీ నెక్ట్స్ షెడ్యూల్ ముంబయ్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. “లైగర్ “మూవీ చిత్రీకరణ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – “లైగర్ “మూవీ చిత్రీకరణ 65 శాతం పూర్తయిందనీ , క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణకు దాదాపు వెయ్యిమంది సెట్స్లో ఉండాలనీ , . ప్రస్తుత పరిస్థితుల్లో అంతమందితో చిత్రీకరణ అంటే కొంత రిస్క్తో కూడుకున్న పననీ, ‘లైగర్’ లాంటి భారీ సినిమా చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సవాల్ అనే చెప్పాలనీ , అలాగే కరోనా థర్డ్ వేవ్ అవకాశాలను కూడా ఆలోచించి చిత్రీకరణను ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: