దర్శకుడు సాచి దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మలయాళ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో”అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాదాపు 40 శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న ఈమూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొనడంలో టాలీవుడ్ లో షూటింగ్స్ సందడి మొదలయ్యింది. “అయ్యప్పనుమ్ కోషియుమ్” తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ ఈ నెల 12 నుంచి పున:ప్రారంభం కానుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో హీరో పవన్ కళ్యాణ్ తో పాటు నిత్య మీనన్ కూడా పాల్గొంటారు. ఈ మూవీ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు “మూవీ లో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో “#PSPK 28 “మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: