కమర్షియల్ సినిమాలకు కామెడీ యాంగిల్ ను జోడించి ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్లలో శ్రీనువైట్ల పేరు ముందే ఉంటుంది. తన సినిమాల్లో ఉండే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు వరుస హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా ఉన్నా ఇప్పుడు మాత్రం కాస్త స్లోఅయ్యాడు. దానికి వరుసపరాజయాలే కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు చాాలా గ్యాప్ తరువాత మళ్లీ ఢీ సీక్వెల్ తో అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమాను గత ఏడాదే ప్రకటించారు. కానీ కరోనా వల్ల ఆగిపోయింది.ఈసినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీను వైట్ల తన సినిమాల గురించి.. ఇంత కాలం వచ్చిన గ్యాప్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. నాకు చాలా గ్యాప్ వచ్చిందని ఈమధ్య వార్తలు వచ్చాయి కానీ అందులో ఎలాంటి నిజం లేదు.. కానీ కరోనా కారణంగానే ప్రాజెక్ట్ ప్రకటించిన వెంటనే సెట్స్ పైకి వెళ్లలేకపోయాము. ఆ సమయంలో మరో రెండు స్క్రిప్టులను కూడా రెడీ చేసుకున్నాను. ఈ సినిమాలకి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే, ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెలలోనే ‘డి అండ్ డి’ సెట్స్ పైకి తీసుకురావాలనుకున్నాము. కానీ వచ్చేనెల 2వ వారం తరువాత స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము. ఈ సినిమా తరువాత గ్యాప్ లేకుండానే మిగతా రెండు సినిమాలు మొదలుపెట్టాలనుకుంటున్నాను. కథలను బట్టి ఏ హీరో సెట్ అవుతాడో ఆ హీరోలను సంప్రదిస్తాను. ఈ మూడు కథలు కూడా నాన్ స్టాప్గా నవ్వించేవే. గతంలో నా నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకునేవారో అలాగే ఈ సినిమాలు ఉంటాయి” అని తెలిపాడు. మరి చూద్దాం ఈసినిమాలతో అయినా శ్రీను వైట్ల కు మంచి బ్రేక్ వస్తుందేమో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: