సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. సమంత శకుంతల , దేవ్ మోహన్ దుష్యంతుడు గా నటిస్తున్న ఈ మూవీ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో రూపొందుతున్న “శాకుంతలం ” మూవీ లాక్ డౌన్ కు ముందు 50 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.“శాకుంతలం ” మూవీ షూటింగ్ నిన్న రామోజీ ఫిల్మ్సిటీలో పునః ప్రారంభం అయ్యింది. కరోనా నేపథ్యంలో తరచూ సెట్ను శానిటైజ్ చేయడంతో పాటు యూనిట్ సభ్యులు తప్పనిసరిగా మాస్క్లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటూ హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ సాల్మన్రాజు నేతృత్వంలో యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. “శాకుంతలం ” మూవీని తెలుగు, తమిళం, మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడ రిలీజ్ చేయనున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: