పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో “రాధేశ్యామ్ “, బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “, ఓం రౌత్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో 3D ఫార్మాట్ లో “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణం గా ఈ మూడు భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ , శృతిహాసన్ జంటగా తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్ “షూటింగ్ షెడ్యూల్ గోదావరి ఖని వద్ద కోల్ మైన్స్ లో జరిగిన విషయం తెలిసిందే. “సలార్ “మూవీ కై రెండు భారీ సెట్స్ రూపొందాయి.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“సలార్ “మూవీ డబ్బింగ్ వెర్షన్స్ తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు “సలార్ ” మూవీ షూటింగ్ పునఃప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘సలార్’ తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ ఆగస్ట్ లో ప్రారంభం కానుందనీ , ఈ షెడ్యూల్లో ప్రభాస్, శ్రుతీహాసన్లపై కీలక సన్నివేశాల చిత్రీకరణకు దర్శకుడు ప్రశాంత్ ప్లాన్ చేశారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: