సౌత్ సినిమాలకు నార్త్ లో మంచి డిమాండ్ పెరిగిపోతుంది. ఒకప్పుడు ఒకటో రెండో సినిమాలు అక్కడ రీమేక్ అయ్యేవి.. ఇప్పుడు వరుసపెట్టి ఇక్కడ హిట్ అయిన ప్రతి సినిమాను అక్కడ రీమేక్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడు మరో సినిమా రీమేక్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన నాంది సినిమా ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ కామెడీ పాత్రలతో కనిపించే అల్లరి నరేష్.. ఇలా సీరియస్గా నటనకు ప్రాధాన్యమున్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించే రేంజ్ లో నటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ ,తమిళ ,కన్నడ, మలయాళ రీమేక్ రైట్స్ ను నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే హిందీ చిత్రాన్ని అజయ్ దేవగన్ తో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అజయ్ దేవగన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పరాగ్ దేశాయ్, దిల్ రాజు, కుల్దీప్ రాథోడ్తో కలిసి అజయ్ దేవగణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Time to share an important story with all! @DilRajuProdctns and @ADFFilms are all set to produce the Hindi remake of the Telugu hit, Naandhi! @SVC_official @Meena_Iyer @kuldeeprathor9 @ParagDesai #MumbaiTalkeez #NaandhiInHindi pic.twitter.com/jxLAodGeWp
— Ajay Devgn (@ajaydevgn) June 25, 2021
ఇక దిల్ రాజు ఇప్పటికే బాలీవుడ్ లో వరుస సినిమాలు నిర్మిస్తున్నాడు. జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న దిల్ రాజు తరువాత హిట్, ఎఫ్ 2 చిత్రాలను సైతం బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. మరోవైపు తమిళ్ డైరెక్టర్లు.. హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: