మ్యాచో హీరో గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆరడుగుల బుల్లెట్’. నిజానికి 2017లో విడుదలవాల్సిన సినిమా ఇది. కానీ డైరెక్టర్ మారడం.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు ఈసినిమా రిలీజ్ కు టైమ్ కలిసొచ్చింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్` చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ను స్టార్ట్ చేసి విడుదల తేదీ వంటి విషయాలపై పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేష్ ఈసినిమాను నిర్మించారు. అంతేకాదు గోపిచంద్, నయనతార కాంబినేషన్, బి. గోపాల్ డైరెక్షన్, వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయని నిర్మాత ధీమా వ్యక్తంచేస్తున్నారు. చూద్దాం మరి ఇన్నేళ్ల గ్యాప్ తరువాత వస్తున్న ఈసినిమా ఎలాంటి విజయం దక్కించుకుంటుందో.
ఇక ఇదిలా ఉండగా గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇంకా దీనితో పాటు మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు గోపీచంద్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: