ఎంతోమంది కరోనా బాధితులకు తనవంతూ సహకారం అందిస్తూ.. సాయం అడిగిన వారికి కాదనకుండా నేటి కర్ణుడిలా తయారయ్యాడు సోనూసూద్. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ప్రజల్లో దేవుడిగా మారిపోయారు. ఇక సెకండ్ వేవ్ లో చాలా మంది ఆక్సిజన్ కొరత వల్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఎంతోమందికి ఆక్సిజన్ అందిస్తూ.. అవసరమైన ట్రీట్మెంట్ చేయిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు. అలాంటి సోనూ సూద్ తాజాగా చిరంజీవి, రామ్ చరణ్లపై ప్రశంసలు కురిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తరహాలోనే చిరంజీవి రెండు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంక్ లు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నారు మెగాస్టార్. ఇప్పటికే రెండు మూడు జిల్లాల్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈనేపథ్యంలో సోనూ సూద్ చిరంజీవి, రామ్ చరణ్ల చేస్తున్న మంచి పనిపై స్పందించారు. చిరంజీవి, రామ్ చరణ్ల నిర్ణయం ఎంతో గొప్పది, ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభించడం ఎంతో స్ఫూర్తిదాయకం, ఈ క్రమంలోనే మిగతా సెలెబ్రిటీలు ముందుకు రావాలి. వారికి చేతనైన సాయం చేయాలి. అప్పుడు ప్రజల్లో ఓ గట్టి నమ్మకం ఏర్పడుతుంది. వారు ధైర్యంగా ఉండగలరు. ప్రతీదీ ప్రభుత్వం చేస్తుందని ఎదురుచూడకూడదని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమాలో సోనూ సూద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సోనూసూద్ మెయిన్ విలన్గా నటిస్తున్నాడు. దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశంతో తెరకెక్కుతున్న ఈసినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: