ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శకుంతల , దేవ్ మోహన్ దుష్యంతుడు గా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో రూపొందుతున్న “శాకుంతలం ” మూవీ లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ , 10 రోజుల కశ్మీర్ షూటింగ్ షెడ్యూల్ తో 50 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. “శాకుంతలం”మూవీ నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ కై భారీ సెట్ రూపొందింది. లాక్ డౌన్ టైమింగ్ కు అనుగుణంగా షూటింగ్ జరపడానికి దర్శకుడు గుణ శేఖర్ ప్లాన్ చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నఈ షెడ్యూల్ లో “శాకుంతలం”మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ ను దర్శకుడు తెరకెక్కించనున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: