ఈఏడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. అందులో ఒక సినిమా రంగ్ దే. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్, కీర్తి సురేష్ నటించిన సినిమా రంగ్ దే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈసినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటించగా. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పి సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈసినిమాను మార్చి 26న రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. తాజాగా రంగ్ దే సినిమాగురించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ వేదికగా మీ ముందుకు రానుంది. ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా జూన్ 12 నుంచి స్క్రీనింగ్ కానుందని అధికారికంగా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Rangu rangula prema indrajalam #RangDe premieres 12th June nunchi #ZEE5 lo matrame.https://t.co/brVHMVirU9#RangDeOnZEE5 #Premieres12thJune #ZEE5@actor_nithiin @KeerthyOfficial #VenkyAtluri @ThisIsDSP @vamsi84 @SitharaEnts pic.twitter.com/VWaJI70wBT
— BARaju’s Team (@baraju_SuperHit) May 28, 2021
కాగా ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అంధాధున్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: