మే 28న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ వస్తుంది. ఈనేపథ్యంలోనే ఈఏడాది కూడా సర్కారు వారి పాట సినిమా నుండి ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు మహేష్ అభిమానులు. అయితే ఇప్పుడు ఈవార్తలపై క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడున్న సమయంలో అప్ డేట్ లు ఇవ్వడం సరైంది కాదు… అందుకే సర్కారు వారి పాట నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడంలేదు. దీనికి సంబంధించి ఎలాంటి అనఫిషియల్ అప్ డేట్స్.. తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయోద్దు అని అభ్యర్థిస్తున్నాం. అన్ని ప్రకటనలకు సంబంధించి మొదట మా అధికారిక ఖాతాలలో పోస్ట్ చేయనున్నాం అని తెలిపారు.
ALERT!! 🔔@urstrulymahesh #SarkaruVaariPaata pic.twitter.com/kiKunIj8QC
— Team Mahesh Babu (@MBofficialTeam) May 26, 2021
కాగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరో నెలలో కరోనా ఉదృతి తగ్గితే జులై నుంచి షూటింగ్ ను ప్రారంభించాలని చూస్తున్నారు చిత్రయూనిట్. సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: