మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్ “మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి హాసన్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నయాక్షన్ ఎంటర్ టైనర్ “సలార్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ సేతుపతి కి శృతి జోడీగా నటించిన “లాభం “తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం సమాజంలో సంకుచిత ధోరణులు పెరిగిపోయాయనీ , ఎలాంటి పరిణామాలు ఎదురైనా తాను మాత్రం నిజాలే మాట్లాడుతాననీ శృతి హాసన్ చెప్పారు. సెలబ్రిటీస్ ఏం మాట్లాడినా విషయాల్ని వక్రీకరించడం నేడు సర్వసాధారణమైపోయిందనీ , మనం చెప్పిన విషయాలను విమర్శించాలనుకునే వారు ఎప్పుడూ ఉంటారనీ , అలాంటి వ్యక్తుల గురించి తాను అస్సలు పట్టించుకోననీ , భావప్రకటన విషయంలో ఎదుటి వారి స్వేచ్ఛను తాను గౌరవిస్తాననీ , అదే విధంగా తన అభిప్రాయాల్ని కూడా గౌరవించాలనుకుంటాననీ , కేవలం విమర్శలతో కాలం గడపడం అజ్ఞానమనిపించుకుంటుందనీ శృతి హాసన్ స్పందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: