సైకలాజికల్ థ్రిల్లర్ “సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్, బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ కథానాయికగా నటించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్న నిధి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో నిధి తన ఫొటోస్ ,వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో ప్రజలు భయాందోళనలతో జీవిస్తున్నారు. ఈ నేపథ్యం లో కోవిడ్ నివారణ కై ప్రభుత్వం చేపడుతున్న పోరాటానికి అండగా నిలిచేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. . తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ తమిళ నాడు సిఎమ్ సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళం అందించారు. అంతేకాదు దేశంలో హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న బెడ్స్ సమాచారాన్ని “ఫైండ్ ఏ బెడ్” పేరుతో తెలుసుకునేందుకు కాజ్ అంబాసిడర్గా నిధి ప్రచార సాయం కూడా చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: