దర్శకుడు సాచి దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మలయాళ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో”అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ ఎంపిక అయ్యారు. దాదాపు 50 శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నా ఈ మూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగానే నిత్యామీనన్ షూటింగ్ లో పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ లపై కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి దర్శకుడు ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన “వకీల్ సాబ్ “మూవీ ఘనవిజయం సాధించిన విషయంతెలిసిందే . క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “హరిహర వీరమల్లు ” మూవీ తెరకెక్కుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: