టాలీవుడ్ లో ఒకొక్కరు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీలో ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు మరోమెగా హీరోకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజవీ అల్లుడు కళ్యాణ్ దేవ్. ఈవిషయాన్ని స్వయంగా తానే తెలియచేశాడు. కొన్ని కోవిడ్ లక్షణాలు ఉండడంతో నిన్న కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది అని ప్రస్తుతం ఆసుపత్రిలో క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమా జయాపజయాల గురించి ఆలోచించకుండా కొత్త సినిమాలతో కళ్యాణ్ దేవ్ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు ఇప్పటికే పులి వాసు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ‘సూపర్ మచ్చి’ అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా.. కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్ తో వస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అశ్వద్ధామ ఫేమ్ రమణ తేజ కాంబినేషన్ లో కొత్త సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: