గత ఏడాది కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఇప్పటికీ కోలుకోలేదు. సినీ కార్మికులు. హీరోలు సినిమాలు లేక ఖాళీగా ఉండిపోయారు. నిర్మాతలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏదో ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి.. థియేటర్లలో కాస్త సినిమాల సందడి మొదలైంది అనుకునేలోపే కరోనా సెకండ్ వేవ్ అంటూ మరో పిడుగు పడింది. మరోసారి వరుసగా సినిమా షూటింగ్ లు రద్దవుతున్నాయి. సినిమా రిలీజ్ లు కూడా వాయిదా పడుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పరిమిత బృందంతో చిత్రీకరణలు, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకటనలో పేర్కొంది. అత్యవసరం అనుకుంటే 50 మంది కార్మికులతో షూటింగ్ చేసుకోవచ్చని, అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలిపింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: