హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. రీసెంట్ గానే తను నటించిన శశి సినిమా రిలీజ్ అయింది. ఇంకా సినిమాతో పాటు పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వంలో ‘జంగిల్’ అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ బ్యానర్స్పై మహేష్ గోవిందరాజ్, అర్చనా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’. ఈ సినిమాతో పాటు భాస్కర్ బంటు పల్లి దర్శకత్వంలో ఓసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటితో పాటు మరో సినిమాను కన్ఫామ్ చేశాడు. అహ నా పెళ్ళంట, పూలరంగడు వంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు ఎం.వీరభద్రం వీరభద్రంతో సినిమా చేయనున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో `చుట్టాలబ్బాయి` సూపర్హిట్ అయ్యింది. సాయికుమార్ హీరోగా, ఎం. వీరభద్రం దర్శకత్వంలో విజన్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ పతాకాలపై నాగం తిరుపతి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాతలుగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని వివరాలు తెలియజేయనున్నారు.
ఈ సందర్భంగా ..దర్శకుడు ఎం. వీరభద్రం మాట్లాడుతూ – “ ఆది సాయికుమార్ హీరోగా నేను దర్శకత్వం వహించిన `చుట్టాలబ్బాయి` మంచి హిట్ అయింది. ప్రస్తుతం మరోసారి మా కాంబినేషన్లో అధ్భుతమైన విజయాన్ని సాధించే సినిమా చేయాలని ప్లాన్ చేశాం. సబ్జెక్ట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా మరో మంచి హిట్ సినిమా అవుతుంది. నాగం తిరుపతి రెడ్డి, పి. మన్మథరావు మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు. ఒక సూపర్హిట్ సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నారు. వారి నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తాం“ అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: