“లక్ష్మీ కళ్యాణం ” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కాజల్ అగర్వాల్ సూపర్ హిట్ “చందమామ ” మూవీ తో గుర్తింపు పొంది 13 సంవత్సరాలుగా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ కథానాయికగా రూపొందిన పలు తెలుగు , తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “(తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. కరోనా పై కాజల్ స్పందించి సోషల్ మీడియా లో ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కరోనా కారణంగా ప్రపంచం తల్లడిల్లుతోంది. ప్రజలు కష్టాల పాలవుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఒక అమ్మాయిని వేరే ఇంటికి పంపించడం.. దూరంగా ఉన్న కాలేజీకి మన సోదరులను పంపడం.. పెంపుడు జంతువుకు దీర్ఘకాలిక వ్యాధి ఉండటం.. గ్రాండ్ పేరెంట్స్కి దూరం అవడం, స్నేహితులు అపార్థం చేసుకోవడం, మీరు ప్రేమించే వ్యక్తి మౌనం వహించడం, ప్రేమానుబంధాలకు మిమ్మల్ని మీరే దూరం చేసుకోవడం.. ఇలాంటివి జరిగితే మీకు నష్టం అంటే ఏంటో తెలుస్తుంది. అది మీకు ఊహించినట్లు మీ ముందుకు రాదు.. రూపం మార్చుకుంటుంది. కాబట్టి విషాదంతో బేరాలు వద్దు. బాధ మనకే.. గ్రహాంతరవాసికి కాదు’’ అంటూ కాజల్ ఒక ఎమోషనల్ నోట్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులకు స్టే హోమ్ , స్టే సేఫ్ అంటూ సందేశం ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: