బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో కృతి కథానాయికగా నటిస్తున్నారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి “మూవీ లో హీరో సుధీర్ బాబు కు జోడీగా కృతి నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కృతిశెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. ట్రెడిషినల్ లెహంగా ధరించి కృతి ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఆ డ్రెస్ లోకృతి మరింత అందంగా కనపడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కృతి మ్యాజికల్ లుక్స్ తో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. కృతి తన అందంతో యూత్ ను ఆకట్టుకుని వారికి కలల రాణి గా నిలిచారు. టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న కథానాయికగా కృతి రాణిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: