మెగా కాంపౌండ్ నుండి వచ్చి ఒక్క సినిమాతో ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోస్ కే పోటీ ఇస్తున్నాడు. ఆహీరో ఇంకెవరూ సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతూ బిజీ అయిపోతున్నాడు. అంతేనా పెద్ద పెద్ద బ్యానర్స్ లోనే చాన్స్ లు కొట్టేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ను తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ సినిమా వస్తున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటికి క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఈరోజు హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి హీరో సాయితేజ్ క్లాప్కొట్టగా, విజయ్ దుర్గ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడు స్క్రిప్ట్ను దర్శకుడు గిరీశాయకు అందించారు.
Happy to announce our next with #VaisshnavTej, has launched formally today with a pooja ceremony. @ketikasharmaa will be the female lead.
Direction by @GIREESAAYAClap 🎬 by @IamSaiDharamTej
Camera🎥 switch on by #VijayaDurga garu#Vaisshnav3 @BvsnP pic.twitter.com/341xArb6jS— SVCC (@SVCCofficial) April 2, 2021
ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్పై బాపినీడు సమర్పణలో… సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బ్యానర్లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ను డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించిన గిరీశాయ ఈ చిత్రంతో టాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఉప్పెనతో యూత్కు దగ్గరైన వైష్ణవ్ తేజ్ను ఫ్యామిలీ ఆడియెన్స్కు దగ్గర చేసేంత మంచి కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించబోతున్నామని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: