చందు మెుండేటి కాంబినేషన్ లో నిఖిల్ హీరోగా కార్తికేయ 2 వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే గుజరాత్ షెడ్యుల్ లో నిఖిల్ కు గాయమవ్వగా .. ఇప్పుడు షూటింగ్ కు మరో అడ్డంకి వచ్చింది. కార్తికేయ 2 షూటింగ్ కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్లోని సిస్సులో జరుగుతుంది. హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్తో పాటు ఇతర నటీనటులు కూడా అక్కడే ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు అక్కడ వాతావరణ పరిస్థితులు బాగా లేకపోవడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. మంచు తుఫాన్ కారణంగా చిత్రయూనిట్ అక్కడే స్ట్రక్ అయిపోయింది. మంచు తుఫాన్ తగ్గిన తర్వాత.. పరిస్థితులు చక్కబడ్డాక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నట్టు చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
We are all at Mother Natures Mercy…
Our #Karthikeya2 Film Unit After completing a 20 day Schedule in Gujarat…
Are Now stuck in a SnowStorm in Sissu Himachal… @peoplemediafcy @AbhishekOfficl @chandoomondeti @KarthikGhattam1 @vivekkuchibotla @kaalabhairava7 pic.twitter.com/KLh1H53jEg— Nikhil Siddhartha (@actor_Nikhil) March 24, 2021
ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా… ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. మరి నిఖిల్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. చూద్దాం కార్తికేయ2 ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: