సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియనుమ్’ సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిజు మీనన్ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తుండగా.. రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమాలో నటించే ఒక హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. రీసెంట్ గా ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. హీరో విలన్ లాగా చూపించట్లేదు.. సినిమా లైన్ తీసుకున్నాం… అయితే మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాం.. సాగర్ చంద్ర యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్.. తాను అయితే ఈసినిమాకు బావుంటుందని తీసుకున్నాం.. మలయాళంలో లాస్ట్ లో ఒక డైలాగ్ తో ఎండ్ చేస్తారు.. ఇక్కడ పవన్ కు ఫ్లాష్ బ్యాక్ పెడుతున్నాం అని చెప్పాడు. ఇక ఈసినిమాలో రాానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ ఫిక్స్ అయిందని.. పవన్ కు ఇంకా చూస్తున్నామని తెలిపాడు నాగవంశీ.
కాగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: