గత ఏడాది కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో చూశాం. ఇక సినీ పరిశ్రమ కూడా ఎంత నష్టపోయిందో చూశాం. ఇటీవలే కాస్త పరిస్థితులు మెరుగుపడటంతో మళ్ళీ సినిమాల షూటింగ్ లు, రిలీజ్ లు, ప్రెస్ మీట్లతో బిజీ అయింది చిత్ర పరిశ్రమ. అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తలనొప్పి మొదలైంది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. గత కొన్ని రోజులుగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఓ వైపు వ్యాక్సిన్ ఇస్తున్నా.. మరోవైపు కేసులు పెరగడం ఇప్పుడు అందరిలో ఆందోళనను కలిగిస్తోంది. ఈనేపథ్యంలోనే ఇక్కడ కూడా థియేటర్స్ మూసేస్తారేమో అన్న వార్తలు మొదలయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలాఉండగా దీనిలో భాగంగానే తన సినిమా రిలీజ్ ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది రానా. నార్త్ లో కరోనా ప్రభావం మళ్లీ కాస్త ఎక్కువవడంతో హథీ మేరే సాథి సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హథీ మేరే సాథిమార్చి 26న రిలీజ్ అవ్వడం లేదంటూ మూవీ యూనిట్ అధికారిక ప్రకటనను ఇచ్చింది. నిజానికి మార్చి 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో రెండు రోజుల్లో ఈ మూవీ విడుదల ఉండగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తెలుగు, తమిళ్ వెర్షన్స్ మాత్రం అనుకున్న తేదీనే రిలీజ్ అవుతున్నాయి.
Important Haathi Mere Saathi Release Update (👇) pic.twitter.com/h2OyuhZ20C
— Eros Now (@ErosNow) March 23, 2021
ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా వస్తున్న ఈసినిమా హిందీలో “హాథీ మేరే సాథీ ” గా తెలుగులో ‘అరణ్య’, తమిళ్లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇంకా ఈ సినిమాలో శ్రియ పిల్ గోవింకర్, పులకిత్ సామ్రాట్, జగపతి బాబు, పోసాని, విష్ణు విశాల్, మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు. ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: